నిడదవోలు పురపాలక సంఘ ఉపాధ్యక్ష పదవి జనసేన కైవసం! ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక!
Mon Jun 02, 2025 16:03 Politics
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ ఉపాధ్యక్ష పదవి జనసేన పార్టీ పరమైంది. వైకాపా నుంచి తాజాగా జనసేనలో చేరిన షేక్ వసీరుద్దీన్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పాలకవర్గంతో ఏర్పడిన రాష్ట్రంలోని మొదటి పురపాలక సంఘంగా నిడదవోలు మున్సిపాలిటీ నిలిచింది. గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 28 కౌన్సిల్ స్థానాలకు గానూ 27 మంది వైకాపా అభ్యర్థులు, తెదేపాకి చెందిన ఒకరు విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో దశల వారీగా చైర్మన్ తో సహా 14 మంది వైకాపా కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం జరిగిన ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో 14 మంది పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష వైకాపా కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాకపోయినప్పటికీ.. కోరం ఉండటంతో నిబంధనల ప్రకారం అధికారులు ఎన్నిక నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనసేన పార్టీ అభ్యర్థులతో ఏర్పాటైన తొలి మున్సిపాలిటీ నిడదవోలు అని వెల్లడించారు. ఇది ఆరంభం మాత్రమేనని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మరిన్ని పురపాలక సంఘాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్లోనే, భూసేకరణకు రెడీ!
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #nidadavolu #DeputyChairmanPost #Janasena
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.